బీజేపీ కార్పొరేటర్‌పై అధికారిపై దాడి ఆరోపణ

BJP Corporator Booked for Attacking GHMC Officer

హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ అధికారిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్‌పై అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఓ సెక్షన్ అధికారి తన విధుల్లో ఉండగా ఈ దాడి జరిగింది అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు, పోలీసులు బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 132 – ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, సెక్షన్ 352 – దాడికి పాల్పడటం కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి విచారణ ప్రారంభించారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఈ తరహా దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా తెలిపారు. సంబంధిత అధికారుల నుంచి సంఘటన వివరాలను ఆయన సేకరించారు.

అబిడ్స్ పోలీసుల నుంచి కార్పొరేటర్‌పై కేసు నమోదైన విషయాన్ని కమిషనర్‌కు సమాచారం అందించారు. అధికారులు తమ విధుల్లో స్వేచ్ఛగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అలాంటి పరిస్థితిని భంగపర్చే చర్యలను కఠినంగా ఎదుర్కొనాలనేది జీహెచ్‌ఎంసీ వైఖరిగా నిలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share