చరణ్‌పై శిరీష్ వ్యాఖ్యలపై దిల్ రాజు క్లారిటీ

Dil Raju says Shirish’s words were misunderstood; confirms next project with Ram Charan soon.

‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించిన నిర్మాత శిరీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. శిరీష్ మాటల ఉద్దేశం వేరని, వాటిని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. రామ్ చరణ్‌పై తనకెప్పుడూ గౌరవం ఉందని, ఆయన సహనానికి, నిబద్ధతకు తాము కృతజ్ఞులమని దిల్ రాజు పేర్కొన్నారు. ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు, ఈ వివాదానికి ముగింపు పలికేలా క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల నిర్మాత శిరీష్ ఒక ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ విడుదల తర్వాత చరణ్, శంకర్ తమకు కనీసం ఫోన్ కూడా చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ మాటలు క్షణాల్లో వైరల్ అవి చరణ్ అభిమానులను రోషం చేరుకోవడానికి కారణమయ్యాయి. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ, శిరీష్ ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ కోణంలో ఆలోచిస్తారని, ఇంటర్వ్యూలకు అనుభవం లేకపోవడం వల్లే ఇలా మాట్లాడారని చెప్పారు. పూర్తి ఇంటర్వ్యూలో అసలు ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుందని, చిన్న క్లిప్ చూసి అపార్థం చేసుకోవడం సరికాదన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ “చరణ్‌‍తో ఈ ప్రాజెక్ట్‌లో నేను, శంకర్ కలిసి చాలా సమయం గడిపాం. ప్రాజెక్ట్ ఆలస్యం అయినప్పటికీ చరణ్ ఎంతో సహనం చూపారు. ఆయనకు ఇతర ఆఫర్లు ఉన్నా గేమ్ ఛేంజర్‌కే కట్టుబడి ఉన్నారు. ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఈ సినిమా పూర్తి కష్టతరం అయినా చరణ్ ఎక్కడా తగ్గలేదు. చరణ్ వంటి వ్యక్తితో పనిచేయడం గర్వంగా ఉంది” అని ప్రశంసలు కురిపించారు.

తుదిగా దిల్ రాజు మరో సంతోషకరమైన ప్రకటన చేశారు. “రామ్ చరణ్‌కు మా బ్యానర్ నుంచి గొప్ప విజయం ఇవ్వాలన్నది నా కోరిక. అందుకే 2026 కోసం కొన్ని స్క్రిప్ట్‌లు సిద్ధం చేస్తున్నాం. చరణ్‌కు సరిపడే కథను తీసుకుని తదుపరి సినిమాను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. ఇది రామ్ చరణ్ అభిమానులకు హ్యాపీ న్యూస్‌గా ఉంటుంది” అని తెలిపారు. ఈ ప్రకటనతో చరణ్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share