పరిగిలో 19 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

Parigi MLA T. Rammohan Reddy said 19 sarpanches are united; Rs 10 lakh funds to be allocated for development in these villages.

పరిగి నియోజకవర్గ చరిత్రలో ఏకంగా 19 మంది సర్పంచులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం మొదటిసారి జరిగిందని ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన పరిగి ఎమ్మెల్యే నివాసంలో బుధవారం విలేకరులతో సమావేశమై, గ్రామాల్లో ప్రజలు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం చూపినందుకు సర్పంచులు ఏకగ్రీవమై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

నియోజకవర్గంలోని చౌడాపూర్‌లో 6 గ్రామాలు, దోమ మండలం 5, కులక చర్ల 3, పరిగి 2, గండీడ్ 2, పూడూరు 1, మహమ్మదాబాద్ 1 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 10 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేయడానికి సర్పంచులకు త్వరలో హస్తాంతరం చేస్తానని రామ్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఏకగ్రీవ సర్పంచులను కాంగ్రెస్ పార్టీ తరపున కండువా కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూమన్న గారి పరుశురాం రెడ్డి, స్థానిక మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 19 గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవం చేయడానికి కృషి చేసిన గ్రామ పెద్దలు, పార్టీ నాయకులను ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share