బ్రిటన్కు చెందిన అత్యాధునిక ఎఫ్-35 యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో ఐదు వారాలుగా స్థిరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. జూన్ 14న హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేయగా, అప్పటి నుంచి ఈ విమానం అక్కడే నిలిచిపోయింది. మొదట రన్వే పైనే ఉండగా, తర్వాత షెడ్డు ప్రాంతానికి తరలించారు.
విమానంలోని సమస్యను పరిష్కరించేందుకు బ్రిటన్ నుంచి నిపుణుల బృందం కేరళకు వచ్చి మరమ్మతులు చేపట్టింది. అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోయాయి. దీనితో రాయల్ నేవీ ప్రత్యేకంగా ఓ నిపుణుల బృందాన్ని పంపింది. వారు బాగా లోతుగా పరిశీలించి సమస్యను గుర్తించి, విజయవంతంగా మరమ్మతులు చేశారు.
ఈ మరమ్మతుల అనంతరం ఎఫ్-35 యుద్ధ విమానం తిరిగి గాల్లోకి లేచింది. విమానం టెక్నికల్గా సరిగానే పనిచేస్తోందని నిర్ధారించిన తరువాత అధికారులు దాన్ని బ్రిటన్కు తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. తాత్కాలికంగా జరిగిన సాంకేతిక లోపం విమాన ప్రయాణాలపై ప్రభావం చూపకుండానే చక్కదిద్దబడిందని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ఈ ఘటనతో తిరువనంతపురం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొంతవరకు అంతరాయం ఏర్పడింది. అయినా, అంతర్జాతీయ ప్రమాణాలతో రిపేర్లు జరిగి, ఎఫ్-35 మళ్లీ గాల్లోకి లేవడంతో విమానాశ్రయ అధికారులూ, రక్షణ శాఖ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.









