భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుతమైన విజయాన్ని సాధించింది. అమెరికాకు చెందిన టెలికాం శాటిలైట్ ‘బ్లూబర్డ్-6’ ను LVM3 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంతో భారత్ ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి భారత అంతరిక్ష సామర్థ్యాన్ని గ్లోబల్ స్థాయికి చేరిందని కొనియాడారు.
ఈ ప్రయోగం ద్వారా భారత్ ఒక ‘గ్లోబల్ స్పేస్ లాంచ్ హబ్’గా మారుతున్నది. బ్లూబర్డ్-6 శాటిలైట్లో ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనికేషన్ యాంటెన్నా ఉంది, ఇది వేలాది ప్రాంతాలకు ఒకేసారి సిగ్నల్స్ పంపగలదు. దీని ద్వారా సెల్ టవర్లు లేని గ్రామాలు, అడవులు, పర్వతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా నిరంతర మొబైల్ సేవలు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, భారత్ ‘లీగల్ లాంచింగ్ స్టేట్’గా గుర్తింపు పొందింది.
భారత్ను ఇస్రోని ఎంచుకోవడానికి అమెరికా వంటి దేశాల ప్రధాన కారణాలు ఖచ్చితత్వం, భద్రత, వ్యయసామర్థ్యం. చంద్రయాన్, గగన్యాన్ వంటి విజయాలు భారత రాకెట్ సాంకేతికతపై అంతర్జాతీయ నమ్మకాన్ని పెంచాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్కు భారీగా విదేశీ ఆదాయం లభించడమే కాకుండా, అంతర్జాతీయ కాంట్రాక్టులు పెరుగుతాయి.
నిపుణుల ప్రకారం, ఈ ప్రయోగం ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో ప్రపంచానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించే దిశలో భారత్ ముందడుగు వేసింది. భవిష్యత్తులో స్పేస్ టెక్నాలజీ, డేటా సైన్స్, స్పేస్ లా వంటి రంగాల్లో అపారమైన ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని విద్యార్థులు, యువతికి స్ఫూర్తిదాయకం అవుతుందని వారు సూచించారు.








