సేవింగ్స్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు

Several public sector banks, including SBI, have waived minimum balance charges on savings accounts, offering major relief to customers.

దేశంలోని కోటి మందికి పైగా బ్యాంకు ఖాతాదారులకు ఇది ఒక శుభవార్త. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వినియోగదారులకు ఊరటనిస్తూ, సేవింగ్స్ ఖాతాలలో కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) లేకపోతే విధించే ఛార్జీలను రద్దు చేశాయి. ఈ చర్య ద్వారా ముఖ్యంగా సాధారణ, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. బ్యాంకింగ్ సౌలభ్యం పెరిగేందుకు మరియు ప్రజలు మరింతగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావడానికి ఇది మరొక మెట్టు.

జూలై 1, 2025 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ సేవింగ్స్ ఖాతాలపై ఈ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఇది ప్రీమియం కేటగిరీ ఖాతాలకు వర్తించదని స్పష్టం చేసింది. ఇదే బాటలో ఇండియన్ బ్యాంక్ కూడా జూలై 7, 2025 నుంచి తన ఖాతాదారులకు ఇదే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో సేవింగ్స్ ఖాతాదారులు ఇకపై మినిమం నిల్వ కోసం అశాంతికి గురికావలసిన అవసరం లేదు.

ఇక కెనరా బ్యాంక్ గతమే నెలే, అంటే 2025 మేలోనే ఈ ఛార్జీలను తొలగించిన బ్యాంకులలో ముందంజ వేసింది. సాధారణ సేవింగ్స్ ఖాతాలతో పాటు, ఎన్ఆర్ఐ ఖాతాలు, శాలరీ ఖాతాలపై కూడా మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు చేసింది. ఇదే తరహాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు కూడా తమ ఖాతాదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయాలను అమలు చేశాయి.

ఇది మారుతున్న బ్యాంకింగ్ ధోరణులకు ప్రతిబింబం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇప్పటికే ఈ ఛార్జీలను గతంలోనే తొలగించి ఉదాహరణగా నిలిచింది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు బ్యాంకింగ్ మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ చర్యలు తీసుకుంటున్నాయి. ఇది ప్రజల పొదుపు ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషించనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share